ETV Bharat / state

సీఎస్​ సమీర్​శర్మకు మరోసారి అస్వస్థత.. కోలుకున్నట్లు తెలిపిన వైద్యులు

author img

By

Published : Nov 3, 2022, 3:26 PM IST

Updated : Nov 3, 2022, 4:52 PM IST

CS SAMEER SHARMA HOSPITALIZED : ఇటీవలే గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్​శర్మ మరోసారి అస్వస్థతకు గురైయ్యారు. అప్రమత్తమైన అధికారులు తాడేపల్లిలోని మణిపాల్​ ఆసుపత్రికి తరలించారు.

CS SAMEER SHARMA HOSPITALIZED
CS SAMEER SHARMA HOSPITALIZED

CS SAMEER SHARMA : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా.. ఉన్నట్టుండి ఓ పక్కకు ఒరిగిపోయారు. వెంటనే గుర్తించి అప్రమత్తమైన అధికారులు.. ఆయనను హుటాహుటిన అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో వైద్యుల బృందం.. సీఎస్​కు చికిత్స అందిస్తున్నారు. సమీర్ శర్మ ఇటీవలే హైదరాబాద్​లో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. కొద్దిరోజుల నుంచి మళ్లీ విధుల్లో పాల్గొంటున్నారు. ఇవాళ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు.

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు మణిపాల్ ఆస్పత్రికి చేరుకుని సీఎస్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమీర్ శర్మకు పలు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అంతా సాధారణంగానే ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయని వైద్యులు వెల్లడించారు. ఆందోళన చెందాల్సిందేమీ లేదని.. సమీర్‌శర్మ కోలుకున్నారని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

సీఎస్​ సమీర్​శర్మకు మరోసారి అస్వస్థత.. కోలుకున్నట్లు తెలిపిన వైద్యులు

ఇవీ చదవండి:

Last Updated :Nov 3, 2022, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.