ETV Bharat / state

లారీ డ్రైవర్ అతివేగానికి యువకుడి ప్రాణం బలి

author img

By

Published : Jun 15, 2020, 12:44 PM IST

లారీ డ్రైవర్ అతివేగానికి ఓ యువకుడి ప్రాణం బలైంది. అతి వేగంగా వస్తున్న ఇసుక లారీ... ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని ఢీకొట్టగా... అతను అక్కడిక్కడే మృతి చెందాడు. అందివచ్చిన కొడుకు చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

a ypung boy died in road accident at Krosuru in Guntur district
గుంటూరు జిల్లా క్రోసూరులో ఇసుక లారీ ఢీకొట్టి యువకుడు మృతి

గుంటూరు జిల్లా క్రోసూరులో ఇసుక లారీని ఢీకొట్టగా.. ఓ యువకుడు మృతి చెందాడు. అచ్చంపేట మండలం చెరుకుంపాలెం గ్రామానికి చెందిన ఆయుధం శ్రీను(18) వ్యక్తిగత పనులు నిమిత్తం... ద్విచక్ర వాహనంపై క్రోసూరు బయలుదేరాడు. అదే రహదారిలో చింతపల్లి రీచ్ వద్దకు ఇసుక కోసం వెళ్తున్న లారీ... యువకుడిని ఢీకొట్టింది. శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మృతిపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లారీ డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: నందివెలుగు శివారు పొలాల్లో చెల్లాచెదురుగా కరెన్సీ నోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.