ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM

author img

By

Published : Nov 20, 2022, 9:00 PM IST

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

.

  • 45 రోజుల్లో 52 లక్షల కుటుంబాలతో భేటీ.. 'ఇదేం ఖర్మ - రాష్ట్రానికి'.. తెదేపా కార్యాచరణ
    వైకాపా నేతల దాడులు, అడ్డగింతలపై ఎదురుదాడినే లక్ష్యంగా చేసుకోవాలని తెలుగుదేశం భావిస్తోంది. వైకాపా అరాచకాలకు ప్రతిఘటనే సరైన విధానమని... పార్టీ విస్తృస్థాయి భేటీలో నేతలు స్పష్టం చేశారు. డిసెంబర్‌ ఒకటి నుంచి ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టాలని.. ప్రతి గ్రామంలో రచ్చబండ నిర్వహించి ప్రజల ఫిర్యాదులను నమోదు చేయాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రేపు నరసాపురంలో సీఎం జగన్ పర్యటన..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రేపు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు.. వివిధ పనులకు జగన్‌ శంకుస్థాపనలు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పవన్​ను ఏదో ఒకరోజు.. ఉన్నతస్థాయిలో చూస్తాం: చిరంజీవి
    మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉండాలంటే చాలా మొరటుగా, కటువుగా ఉండాలన్న చిరంజీవి.. ఆ లక్షణాలు లేకపోవడం వల్లే తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేశారు. రాజకీయాల్లో అడుగుపెట్టాలనుకోవడం తన మనసు నుంచి వచ్చింది కాదన్న చిరంజీవి.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చంద్రబాబు పేరు చెబితే.. వైసీపీ వెన్నులో వణుకు: బొండా ఉమా
    చంద్రబాబు పేరు చెబితే వైసీపీకి వెన్నులో వణుకు పుడుతోందని టీడీపీఅధికారప్రతినిధి బోండా ఉమ ఎద్దెవా చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాట.. మంతి అనే కార్యక్రమంలో బోండా ఉమా, వంగలపూడి అనిత పాల్గొన్నారు. పులివెందుల పక్క ఊర్లో చంద్రబాబుకు వచ్చిన ప్రజాదరణ చూసి.. జగన్ పెంపుడు కుక్కలన్నీ ఒకేసారి మొరుగుతున్నాయని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మీరు ఆడితే లోకమే ఊగదా'.. కేరళను ఊపేస్తున్న సాకర్ ఫీవర్!
    ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ మేనియా కేరళను ఊపేస్తోంది. కేరళలో ఎక్కడ చూసినా రొనాల్డో నిలువెత్తు కటౌట్లు, మెస్సీ ఫ్లెక్సీలు, నెయ్‌మార్‌ బ్యానర్లు, ప్రపంచ కప్‌ ట్రోఫీలు దర్శనమిస్తున్నాయి. అభిమాన ఆటగాళ్ల జెర్సీలు ధరించి మలయాళీలు.. ఫుట్‌బాల్‌పై తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు. మలప్పురంలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రయాణికుడ్ని బస్సులో నుంచి తోసేసిన కండక్టర్ ​ దృశ్యాలు వైరల్​
    ప్రయాణికుడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు ఓ బస్​ కండక్టర్. మద్యం మత్తులో బస్​ ఎక్కిన ప్రయాణికుడిపై నీరు పోసి, బయటకు తోసేశాడు. ఈ ఘటన తమిళనాడు తిరువన్నామలై జిల్లాలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. తమిళనాడు స్టేట్​ ట్రాన్స్​పోర్ట్ ​కార్పోరేషన్​ చెందిన బస్సు వందవాసి, బెంగుళూరు మధ్య నడుస్తుంది. కండక్టర్​పై చర్యలు తీసుకోవాలంటూ అనేక మంది డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమెరికా నైట్‌క్లబ్‌లో కాల్పులు.. ఐదుగురు మృతి.. 18 మందికి గాయాలు
    అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. స్వలింగ సంపర్కుల కోసం ఏర్పాటు చేసిన నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. మరో 18 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మరోసారి తాత అయిన ముకేశ్ అంబానీ.. కవలలకు జన్మనిచ్చిన ఇషా.. పేర్లు ఇవే!
    ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ.. కవల పిల్లలకు జన్మనిచ్చారు. వీరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. వీరిద్దరికీ పేర్లు సైతం ఖరారు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సూర్య సూపర్ సెంచరీ.. కివీస్​తో టీ20 సిరీస్​లో టీమ్ఇండియా బోణీ
    న్యూజిలాండ్​తో జరిగిన రెండో టీ20 మ్యాచ్​లో టీమ్ ఇండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'సలార్‌'పై స్టార్‌ హీరో భార్య ఆసక్తికర కామెంట్స్.. ఏమందంటే!
    క్రేజీ డైరెక్టర్​ ప్రశాంత్​నీల్​ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సలార్‌'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.