ప్రయాణికుడ్ని బస్సులో నుంచి తోసేసిన కండక్టర్ ​ దృశ్యాలు వైరల్​

By

Published : Nov 20, 2022, 8:31 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

thumbnail

ప్రయాణికుడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు ఓ బస్​ కండక్టర్. మద్యం మత్తులో బస్​ ఎక్కిన ప్రయాణికుడిపై నీరు పోసి, బయటకు తోసేశాడు. ఈ ఘటన తమిళనాడు తిరువన్నామలై జిల్లాలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. తమిళనాడు స్టేట్​ ట్రాన్స్​పోర్ట్ ​కార్పోరేషన్​ చెందిన బస్సు వందవాసి, బెంగుళూరు మధ్య నడుస్తుంది. కండక్టర్​పై చర్యలు తీసుకోవాలంటూ అనేక మంది డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన విల్లుపురం ప్రభుత్వ రవాణా సంస్థ జోనల్ డైరెక్టర్ జోసెఫ్, కండక్టర్ ప్రకాష్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.