ETV Bharat / state

అదృశ్యమైన విద్యార్థి.. శవమై తేలాడు

author img

By

Published : Feb 13, 2020, 2:04 PM IST

తూర్పు గోదావరి జిల్లా ముంగండ గ్రామంలో అదృశ్యమైన 10వ తరగతి విద్యార్థి మంచినీటి చెరువులో విగతజీవిగా కనిపించాడు.

student dead body found in munganda
పదో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి

పదో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి

తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని ముంగండ గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి వంక చంద్రశ్రీ వీర వెంకట పవన్ గణేష్.. ఇటీవల అదృశ్యమయ్యాడు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణేష్ 10వ తరగతి చదివేవాడు. సాయంత్రం ట్యూషన్ కోసం సైకిల్​పై వెళ్లాడు. మంగళవారం రాత్రి 11 గంటల వరకు కుమారుడు తిరిగి రాకపోవటంపై తల్లిదండ్రులు రాత్రి అంతా గాలించారు. విద్యార్థి ఆచూకీ లభ్యం కాని పరిస్థితుల్లో ఆవేదన చెందారు. స్థానిక మంచినీటి చెరువు దగ్గర సైకిలు, చెప్పులు ఉండటంతో చెరువులో గాలించారు. చెరువులో పవన్ గణేష్ మృతదేహం లభ్యమవడాన్ని చూసి.. విద్యార్థి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్ఐ కేఎస్వీ ప్రసాద్ అనుమానాస్పద కేసుగా నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

రైల్వేస్టేషన్ లిఫ్ట్​లో చిక్కుకున్న యువకులు...రక్షించిన సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.