ETV Bharat / state

చిక్కింది కిలోన్నర పులస చేప

author img

By

Published : Sep 12, 2020, 1:52 PM IST

pulasa fish at p gannavaram
పి.గన్నవరంలో పులస చేప

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని చేపల మార్కెట్‌లో కిలోన్నర బరువు గల పులస చేప దొరికింది. దాన్ని ఎంతకు అమ్మారనుకుంటున్నారు..! మీరే చూసేయండి..!

మార్కెట్‌లోకి గోదావరి పులస ఎప్పుడొస్తుందా అని పులసప్రియులు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ సీజన్‌లో మత్స్యకారులకు ఇవి చాలా తక్కువగా దొరుకుతున్నాయి. దీంతో వీటి ధరలు బాగా మండిపోతున్నాయి. శుక్రవారం పి.గన్నవరంలోని చేపల మార్కెట్‌లో అసలు సిసలైన గోదావరి పులస కిలోన్నర బరువు గలది రూ.ఏడు వేలుకు అమ్ముడుపోయింది. కిలో బరువుంటే రూ. 4,500 కంటే తక్కువ ధరకు దొరకడం గగనమవుతోంది.

ఇదీ చూడండి. దసరా ఉత్సవాలకు దుర్గగుడిలో విస్తృత ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.