ETV Bharat / state

విద్యాకానుకతో కార్పొరేట్​ స్థాయి చదువులు: మంత్రి విశ్వరూప్

author img

By

Published : Oct 8, 2020, 4:04 PM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాకానుక కార్యక్రమాన్ని మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. ఈ పథకం పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

minister vishwarup
minister vishwarup

జగనన్న విద్యాకానుకతో సామాన్య, మధ్య తరగతి, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉన్నత చదువులు అందుతాయని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాకానుక కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు కావల్సిన మౌలిక సదుపాయాలను కల్పించిన ఘనత సీఎం జగన్​కే దక్కుతుందని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.