ETV Bharat / state

'కౌలు రైతుల ఆత్మహత్యలు బాధాకరం'

author img

By

Published : Mar 31, 2022, 5:43 AM IST

Nadendla Manohar
Nadendla Manohar

తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం పాలతోడు గ్రామంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ పర్యటించారు. రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలు బాధాకరమన్నారు. నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు రామకృష్ణ కుటుంబసభ్యుల్ని ఆయన పరామర్శించారు

రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలు బాధాకరమని జనసేన సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం పాలతోడు గ్రామంలో... గత నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు రామకృష్ణ కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. కౌలు రైతుల చనిపోయి 6 నెలలైనా ప్రభుత్వం ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కౌలు రైతులకు అందాల్సిన సాయాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించేలా చర్యలు చేపడతామని తెలిపారు .

ఇదీ చదవండి: అధికారుల "చెత్త" పని.. మనసులో పెట్టుకోవద్దన్న మేయర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.