ETV Bharat / state

గోదావరికి క్రమంగా పెరుగుతున్న వరద

author img

By

Published : Jul 11, 2020, 8:07 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో... గోదావరికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 9.7 అడుగుల నీటి మట్టం ఉంది. లక్షా 22వేల క్యూసెక్కుల వరద నీరు బ్యారేజీకి వచ్చి చేరుతుంది.

godavari flood water increasing in rajahmahendravaram
క్రమంగా పెరుగుతున్న వరద నీరు

తూర్పుగోదావరి జిల్లాలో గోదావరికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు చేరుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 9.7 అడుగుల నీటి మట్టం ఉంది. బ్యారేజీకి లక్షా 22వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాల్వలకు 3,100 క్యూసెక్కుల నీరు వదులుతులున్నారు. మిగతా వరదనీటిని 172 గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

ఇదీ చదవండి :

గౌతమీ గోదావరి నదీపాయ వద్ద ముందస్తు చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.