ETV Bharat / state

'తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకొస్తాం'

author img

By

Published : Oct 4, 2020, 11:54 PM IST

tdp leaders meeting
తెదేపా నేతల సమావేశం

తూర్పుగోదావరి జిల్లాలో తెదేపాకు పునర్వైభవం తీసుకొస్తామని ఆ పార్టీ జిల్లా నేతలు తెలిపారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జిగా నూతనంగా ఎన్నికైన జ్యోతుల నవీన్ ఇంటి వద్ద ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నవీన్ ఇంటివద్ద జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులుగా నవీన్ ఎంపికైన సందర్భంగా ఈ భేటీ నిర్వహించారు. జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, కాకినాడు రూరల్ తెదేపా నాయకులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా పనిచేయాలని తీర్మానించారు. వైకాపా ప్రభత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.

ఇవీ చదవండి..

'కరోనా బాధితులు కష్టాల్లో ఉంటే సీఎం జగన్ కాలక్షేపం చేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.