ETV Bharat / state

తూర్పు గోదావరి జిల్లాలో మరో ఐదుగురికి కరోనా

author img

By

Published : May 18, 2020, 5:39 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో నేడు ఐదుగురికి కరోనా సోకింది. వీరితో కలిపి బాధితుల సంఖ్య.. 57కు పెరిగింది.

east godavari district corona cases
తూర్పుగోదావరిలో కరోనా కేసులు

తూర్పుగోదావరి జిల్లాలో తాజాగా 5 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రామచంద్రపురంలో 4, రాజమహేంద్రవరంలో ఒకరికి వైరస్‌ సోకింది. రామచంద్రపురంలో ఈనెల 14న ఓ యువకుడికి వైరస్‌ సోకింది. తాజాగా పాజిటివ్ వచ్చిన నలుగురు మహిళలు అతని కుటుంబ సభ్యులే.

రాజమహేంద్రవరంలో బొమ్మూరు క్వారంటైన్లో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లువాసికి కరోనా పాజిటివ్ గా తేలింది. వీరితో కలిపి.. జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 57కు చేరింది. వీరిలో 43 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 14 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మంత్రి సుభాష్‌ చంద్రబోస్‌, ఎంపీ అనురాధ రామచంద్రపురంలో పర్యటించారు.

ఇవీ చదవండి:

రాష్ట్రంలో పలు చోట్లు వర్షాలు కురిసే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.