ETV Bharat / state

'లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే దేవాలయాలపై దాడులు'

author img

By

Published : Jan 5, 2021, 4:12 PM IST

లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే దేవాలయాలపై దాడులు
లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే దేవాలయాలపై దాడులు

లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే పోలీసు వ్యవస్థ నిద్రావస్థలో ఉండటం దారుణమన్నారు.

గతంలో ఎన్నడూ చూడని విధంగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే పోలీసు వ్యవస్థ నిద్రావస్థలో ఉండటం దారుణమన్నారు. అంతర్వేది ఘటనలో దోషులను ఇప్పటివరకు గుర్తించకపోవటం శోచనీయమన్నారు. దేవాలయాలపై దాడులు పెరిపోతుంటే జగన్ స్పందించకుండా ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయనటం సరికాదన్నారు. లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే ఈ ఘటనలు జరగుతున్నాయన్నారు.

వైకాపా చేతకానితనాన్ని ఉపయోగించుకొని భాజాపా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో భాజాపా మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. సీఎం జగన్​కు చిత్తశుద్ధి ఉంటే దేవాలయాలపై దాడులకు పాల్పడ్డ దుండగులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

భక్తుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు: భానుప్రకాశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.