ETV Bharat / state

వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన ఆటో..ప్రయాణీకులు సురక్షితం

author img

By

Published : Oct 5, 2021, 1:47 AM IST

వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన ఆటో
వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన ఆటో

తూర్పు గోదావరి జిల్లా మన్యంలోని రాజవొమ్మంగి మండలంలో వరద ఉద్ధృతికి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో కొట్టుకుపోయింది. నెల్లిమెట్ల వద్ద చిన్నేరు వాగు కాజ్ వే పై నుంచి వరద నీరు ఉధృతిగా ప్రవహిస్తోంది.

వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన ఆటో

తూర్పు గోదావరి జిల్లా మన్యంలోని రాజవొమ్మంగి మండలంలో వరద ఉద్ధృతికి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో కొట్టుకుపోయింది. నెల్లిమెట్ల వద్ద చిన్నేరు వాగు కాజ్ వే పై నుంచి వరద నీరు ఉధృతిగా ప్రవహిస్తోంది. వాగుని దాటే క్రమంలో... ఆటో కాజ్‌వేపై వెళ్తుండగా వెంటనే నీటిలోకి జారిపోయింది. డ్రైవర్ సహా ముగ్గురు వెంటనే బయటకు వచ్చేయడంతో వారికి ప్రమాదం తప్పింది. తర్వాత ఆటోకు తాడు కట్టి స్థానికులు ఒడ్డుకు చేర్చారు.

ఇదీ చదవండి:

వాట్సాప్​, ఇన్​స్టా, ఫేస్​బుక్​ సేవలకు బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.