ETV Bharat / state

ఖాళీ బిందెలతో మహిళలు ధర్నా

author img

By

Published : Jun 19, 2020, 6:38 PM IST

గ్రామంలో రాజకీయాల కారణంగా తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నామని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాల సముద్రం మండలం టీవీఎన్ఆర్ పురం మహిళలు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఖాళీ బిందెలతో ఆ గ్రామ మహిళలంతా ధర్నాకు దిగారు.

Women Dharna for Drinking Water at TVNR. puram in chittoor district
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు ధర్నా

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాల సముద్రం మండలం టీవీఎన్ఆర్ పురంలో... నెల రోజులుగా తాగునీటి ఇబ్బందులు పడుతున్నామంటూ మహిళలు వాపోయారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి విషయమై గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ... మూకుమ్మడిగా కలిసి ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. ఊర్లో కొత్తగా తవ్వించిన బోరుబావిలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ... రాజకీయాలతో తాగేందుకు నీరు దక్కడంలేదని ఆవేదన చెందుతున్నారు.

మండల స్థాయి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకపోతే జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని.... అలాగే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: లైవ్​: మీడియాతో మాట్లాడుతున్న తెదేపా నేత దేవినేని ఉమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.