ETV Bharat / state

'శ్రీవారి సేవలపై వస్తున్న ఆ వార్తలు నమ్మొద్దు'

author img

By

Published : Mar 31, 2020, 1:00 AM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాలు, వైదిక కార్యక్రమాలు జరగటం లేదనే వార్తలను నమ్మోద్దని... తితిదే పెద్దజీయర్ స్వామి ప్రకటించారు. అఖండ దీపం ఆరిపోవటం వంటి వార్తలు అవాస్తవమని తెలిపారు.

peddajiyar speaks about prayers happening in ttd
తిరుమలలో కైంకర్యాల కొనసాగుతున్నాయని తెలుపుతున్న పెద్దజీయర్

తిరుమలలో కైంకర్యాల కొనసాగుతున్నాయని తెలుపుతున్న పెద్దజీయర్

తిరుమల శ్రీవారి ఆలయంలో వైదిక కార్యక్రమాలు సవ్యంగా జరగటం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అవాస్తమని తితిదే పెద్దజీయర్ స్వామి ప్రకటించారు. తిరుపతిలోని పెద్దజీయర్ మఠంలో సమావేశం నిర్వహించారు. అఖండ దీపం ఆరిపోవటం మొదలు...స్వామి వారి కైంకర్యాలలో భాగమైన దిట్టం పరిమాణం తగ్గిందంటూ తప్పుడు ప్రచారం సాగుతోందని ఆయన అన్నారు. రామానుజ పరంపరలో భాగంగా గడచిన 900 సంవత్సరాలుగా స్వామి వారి కైంకర్యాలను సంప్రదాయ, ఆగమ శాస్త్ర బద్ధంగా సాగుతున్నాయని వివరించారు.

ఇదీ చదవండి: సామాజిక సేవలో భాగమైన తితిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.