ETV Bharat / state

' అధికారులు లంచం అడిగితే.. చెట్టుకు కట్టి కొట్టండి..'

author img

By

Published : Dec 31, 2020, 7:23 PM IST

palamaneru mla venkate gowda
palamaneru mla venkate gowda

చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అధికారులు లంచం అడిగితే చెట్టుకు కట్టి కొట్టండని వ్యాఖ్యలు చేశారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లిలో పేదలకు ఇళ్లు కార్యక్రమంలో వెంకటే గౌడ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇళ్ల పట్టాల కోసం ఎవరైనా అధికారులు లంచం అడిగితే.. చెట్టుకు కట్టేసి కొట్టాలని చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లిలో పేదలకు ఇళ్లు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందించటమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఎవరైనా అధికారులు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి లంచం అడిగితే.. చెట్టుకి కట్టేసి కొట్టి... తనకు సమాచారం ఇవ్వాలంటూ వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ ఎమ్మెల్యేనే అధికారులను కొట్టండి అంటూ వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది.

పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ వివాదస్పద వ్యాఖ్యలు

ఇదీ చదవండి: విగ్రహాల విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.