ETV Bharat / state

ఎర్రకోటలో విధ్వంసం.. భాజపా పనే: మాజీ మంత్రి డా.చింతామోహన్

author img

By

Published : Jan 28, 2021, 7:58 AM IST

congress leader chinta mohan on red fort incident
మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్

దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని... మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు. ఎర్రకోట ఘటన భాజపా పనే అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

దేశ రాజధానిలోని ఎర్రకోట ఘటన భాజపా పనే అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్‌ చింతామోహన్‌ ఆరోపించారు. తిరుపతిలోని ఆయన నివాసంలో మాట్లాడిన ఆయన... రైతుల ఉద్యమానికి కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. అన్నదాతల పోరాటాన్ని బలహీన పరిచేందుకు భాజపా కుట్ర చేస్తోందని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ మొండి వైఖరి వీడాలని సూచించారు. కేంద్రం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసేందుకు వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్తు మోటార్లకు మీటర్లు బిగించాలని చూస్తోందని విమర్శించారు. రైతు వ్యతిరేక పనులను ప్రభుత్వం వెంటనే మానుకోకుంటే ఈ నెల 30న గాంధీ వర్ధంతి రోజున కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సంఘీభావ దీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

శేషాచల అడవుల్లో నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.