ETV Bharat / state

చిత్తూరు జిల్లా వాసులు.. అజ్మీర్​లో అవస్థలు!

author img

By

Published : Apr 28, 2020, 12:21 PM IST

అజ్మీర్​లో చిక్కుకున్న చిత్తూరు జిల్లా వాసులు... తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని 'ఈనాడు- ఈటీవీ భారత్'కు తెలిపారు. జిల్లాకు చెందిన 78 మంది మత ప్రార్థన కోసం అజ్మీర్​ దర్గాకు వెళ్లారు. తిరుగు ప్రయాణానికి సిద్ధమైన సమయంలోనే... లాక్​డౌన్​ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి అక్కడే ఉన్న వారంతా... తమను స్వస్థలాలకు చేర్చాలని అధికారులను వేడుకుంటున్నారు.

78 people from chittoor district struck in ajmeer
అజ్మీర్​లో చిక్కుకున్న చిత్తూరు జిల్లా వాసులు

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చిత్తూరు జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు, తిరుపతి, సదుం, పాకాల, కల్లూరుకు చెందిన 78 మంది మార్చి 13న మత ప్రార్థనల కోసం అజ్మీర్‌ దర్గాకు వెళ్లారు. మార్చి 24న తిరుగు ప్రయాణానికి సిద్ధంకాగా.. అంతలోనే లాక్‌డౌన్‌ ప్రకటించారు.

అప్పటి నుంచి అక్కడే చిక్కుకున్నామని ‘ఈనాడు - ఈటీవీ భారత్’ కు చెప్పి ఆవేదన చెందారు. వీరిలో 50 మందికిపైగా మహిళలే ఉండగా.. కొందరికి మధుమేహం, రక్తపోటు, హృద్రోగ సమస్యలు ఉన్నాయి. తమను స్వస్థలాలకు చేర్చాలని అధికారులను వేడుకుంటున్నారు. అజ్మీర్ లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు.

ఇదీ చదవండి:

'వలస కూలీలను స్వస్థలాలకు పంపాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.