ETV Bharat / city

'వలస కూలీలను స్వస్థలాలకు పంపాలి'

author img

By

Published : Apr 27, 2020, 6:00 PM IST

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. వారి సమస్యలపై హైకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్​లపై విచారణ వాయిదా పడిందని వెల్లడించారు.

సీపీఐ రామకృష్ణ
సీపీఐ రామకృష్ణ

వలస కూలీలను ఆదుకోవాలని సీపీఐ రామకృష్ణ విజ్ఞప్తి

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల తరహాలో వారికి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి సాయం అందించాలని కోరారు. వీరితో పాటు రాష్ట్రంలోని వలస కూలీల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. వారిని స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ, వలస కార్మికుల ఇబ్బందులపై తాను హైకోర్టులో పిటిషన్​లు దాఖలు చేశామని గుర్తు చేశారు. వాటిపై విచారణ సోమవారానికి వాయిదా పడిందని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి

'తెదేపా స్లీపర్ సెల్స్ కరోనా వ్యాప్తి చేస్తున్నాయేమో?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.