ETV Bharat / state

Satya Prasad allegations: 'కమీషన్ల కక్కుర్తితో.. పోలవరాన్ని బలి చేస్తున్నారు'

author img

By

Published : May 11, 2023, 7:22 PM IST

TDP MLA Anagani Satya Prasad: పోలవరం అక్రమాలపై తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ విడుదల చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో మేఘా కంపెనీకి ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 4 ఏళ్లల్లో 4 శాతం పనులు కూడా పూర్తి చేయని మేఘా కంపెనీకే తిరిగి పోలవరంలో డయాఫ్రం వాల్ పనులు కట్టబెట్టడం దేనికి సంకేతమంటూ ప్రశ్నించారు.

Anagani Satya Prasad
అనగాని సత్యప్రసాద్

MLA Anagani Satya Prasad on Polavaram tender: కమీషన్ల కక్కుర్తితో జగన్ రెడ్డి పోలవరాన్ని బలి చేస్తున్నారంటూ.. బాపట్ల జిల్లా రేపల్లె తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ విడుదల చేశారు. గత నాలుగేళ్లల్లో 4 శాతం పనులు కూడా పూర్తి చేయని మేఘా కంపెనీకే తిరిగి డయాఫ్రం వాల్ పనులు కట్టబెట్టడం దేనికి సంకేతమని లేఖలో ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో మేఘా కంపెనీకి ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి చేతగానితనంతో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ పనులకు నామమాత్రంగా టెండర్లు పిలిచారని లేఖలో అనగాని ఆరోపించారు.

ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ: పోలవరంలో 4 ఏళ్లల్లో 4 శాతం కూడా పూర్తి చేయని మేఘా మళ్లీ పనులా అంటూ అనగాని ప్రశ్నించారు. కమీషన్లకు కక్కుర్తికి పోలవరాన్ని బలి చేస్తున్న జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వు టెండరింగ్ వడ్డించేవాడు మన వాడైనప్పుడు ఏ బంతిలో కూర్చున్నా పర్వాలేదనే సామెత జగన్ రెడ్డి, మేఘా కంపెనీలకే సరిపోతుందని విమర్శించాడు. 4 ఏళ్లల్లో 4 శాతం పనులు కూడా పూర్తి చేయని మేఘా కంపెనీకే తిరిగి పోలవరంలో డయాఫ్రం వాల్ పనులు కట్టబెట్టడం దేనికి సంకేతమని అనగాని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో మేఘా కంపెనీకి ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తున్నారని ఎమ్మెల్యే లేఖలో పేర్కొన్నారు. జగన్ రెడ్డి చేతగానితనంతో, నిర్లక్ష్య వైఖరితో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ పనులకు నామమాత్రంగా టెండర్లు పిలిచి టెండర్ నిబంధనలకు ఉల్లంఘించి రూ.1615.75 కోట్ల పనులను మేఘా ఇంజినీరింగ్ కు దోచిపెడుతున్నారని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. రూ.100 కోట్లు దాటిన ఏ కాంట్రాక్ట్​కైనా జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసిన తరువాతే ఆ పనులు చేపడతామని జగన్ రెడ్డి ప్రమాణస్వీకారం రోజు చెప్పారని లేఖలో గుర్తుకు చేసిన అనగాని.. ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని జ్యుడీషియల్ ఎంక్వైరీ చేశారో చెప్పే దమ్ము జనగ్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. రికార్డు స్థాయిలో 71 శాతం పనులు, 24 గంటల్లో, 32,350 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన నవయుగ కాంట్రాక్ట్​ను కక్షపూరితంగా తప్పించి మేఘా సంస్థకు పనులు అప్పగించి పోలవరాన్ని అటకెక్కించారని అనగాని ఎద్దేవా చేశారు.

2019లో పోలవరం హెడ్ వర్క్స్ పనులను రూ.1,548.13 కోట్లకు మేఘా దక్కించుకొని సాధించిన ప్రగతి శూన్యం అంటూ ఎమ్మెల్యే అనగాని విమర్శించారు. ఇప్పుడు అదే సంస్థపై చర్యలు తీసుకోకుండా రూ.1,615.75 కోట్ల పనులు ఎలా అప్పగిస్తారని అనగాని లేఖలో ప్రశ్నించారు. మొత్తం మీద రూ.4,623 కోట్ల పనులు మేఘాకు అప్పగించడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడం మీద ధ్యాస పెట్టకుండా పోలవరాన్ని అడ్డుపెట్టుకొని ముడుపులు దండుకొనే పనిలో వైసీపీ నాయకులున్నారని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల బకాయిలు పెడుతున్న జగన్ రెడ్డి మేఘా వంటి సంస్థలకు మాత్రం ఆగమేఘాల మీద బిల్లులు ఎలా చెల్లిస్తుందని లేఖలో ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.