ETV Bharat / state

Cases Filed on False Form 7 Applicants అధికార పార్టీ నయా ఆయుధం ఫారం-7! కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన అధికారులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2023, 9:36 PM IST

Cases Filed on False Form 7 Applicants in Parchur: జనానికి మంచి చేస్తామని చెప్పి ఓట్లు అడిగి గెలవటం మనకు తెలుసు. కానీ ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించి. అడ్డదారిలో గెలవాలని చూడటం అధికార పార్టీ ఇప్పుడు ట్రెండ్‌గా మార్చుకుంది. ఫారం 7 దరఖాస్తుతో విపక్షాల ఓట్లు తొలగించాలన్న వారిపై పోలీసులు కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో హైకోర్టులో ఈ విషయమై పిటిషన్ దాఖలు కావటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు.

Cases Filed on False Form 7 Applicants in Parchur
Cases Filed on False Form 7 Applicants in Parchur

Cases Filed on False Form 7 Applicants in Parchur: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో మార్పుల కోసం వైసీపీ పన్నిన కుట్రలు బట్టబయలయ్యాయి. విపక్షాల ఓట్లు తొలగించాలని ఉద్దేశపూర్వకంగా ఫారం 7 దరఖాస్తు చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పర్చూరు, యద్దనపూడి, చినగంజాం మండలాల్లో పెద్ద ఎత్తున దొంగఓట్లు నమోదు చేశారు.

అలాగే టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని ఎలక్ట్రోరల్ అధికారులకు ఫారం7 దరఖాస్తులు పెట్టారు. వీటన్నింటిని టీడీపీ నాయకులు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాలేదు. ఉపాధి కోసం వేరే చోటికి వెళ్లిన వారి ఓట్లను సొంతూర్లో ఉండటం లేదనే కారణంతో తొలగించాలని.. అలాగే బతికున్న వారిని సైతం చనిపోయారని ఫారం 7 దరఖాస్తులు పెట్టారు. ఆధారాలతో సహా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధికారులకు ఫిర్యాదు చేసినా.. పైనుంచి వచ్చిన ఒత్తిళ్లతో అధికారులు వాటిని పట్టించుకోలేదు.

Case Registered Against Those who Deleted Votes: అధికార పార్టీ ఆధ్వర్యంలో ఓట్లు తొలగింపు ప్రక్రియ.. బతికున్నా చనిపోయినట్లుగా దరఖాస్తులు

దీంతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈ నెల 27వ తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించేందుకు అధికార పార్టీ నేతలు కుట్ర పన్నారని, స్థానిక యంత్రాంగం దీనికి సహకరిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. అందుకు తగిన ఆధారాలు జతపర్చారు. ఈ పిటిషన్​ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో పర్చూరు నియోజకవర్గంలోని అధికారుల్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. తప్పుడు ఫారం 7 దరఖాస్తులు పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పర్చూరు, యద్ధనపూడి, చినగంజాం మండలాల పరిధిలో ఎక్కువగా తప్పుడు ఫారం 7 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై గతంలో టీడీపీ చేసిన ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లలో అధికారులు ఫిర్యాదు చేశారు. ఎలక్ట్రోరల్ అధికారి వెంకటరమణ ఫిర్యాదుతో తప్పుడు ఫారం 7 దరఖాస్తులు ఇచ్చిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Interview with Lawyer on Votes Deletion in AP: ఓట్లను చట్టపరంగా తొలగించలేదు.. ఓటరుకు నోటీసు పంపించాలి : న్యాయవాది యశ్వని

పర్చూరు నియోజకవర్గంలోనే 14 వేల వరకూ ఫారం 7 దరఖాస్తులు పెట్టినట్లు సమాచారం. వైసీపీకి చెందిన దాదాపు 200 మంది ఉద్దేశపూర్వకంగా ఈ కుట్రలో పాలుపంచుకున్నారు. ఈ విషయంపై తాము ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని.. ఇప్పుడు హైకోర్టుకు వెళ్లేసరికి అధికారుల్లో చలనం వచ్చిందని టీడీపీ సానుభూతిపరులు చెబుతున్నారు. ఓట్ల తొలగింపుపై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. బతికి ఉన్న వాళ్లను సైతం చనిపోయారని ఫారాలు పెట్టటం అధికార పార్టీ చేస్తున్న అరాచకానికి నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు.

అనంతపురం జిల్లాలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఉదాసీనంగా వ్యవహరించిన ఇద్దరు జిల్లాస్థాయి అధికారులపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వేటు వేశారు. అది చూసిన తర్వాత కూడా ఇతర అధికారుల్లో చలనం రాలేదు. ఇప్పుడు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు కావటంతో తప్పుడు వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందనే ఆందోళనతో హడావుడిగా పోలీసులకు ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేయించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

AP High Court on Votes Missing Petition: ఏపీలో ఓట్లు తొలగింపు వ్యవహారంపై స్పందించిన హైకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘం, అధికారులకు నోటీసులు..

Cases Filed on False Form 7 Applicants in Parchur: పర్చూరులో తప్పుడు ఫారం 7 దరఖాస్తులు ఇచ్చిన వారిపై కేసులు నమోదు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.