'అందుకోసమే డీఎస్పీ.. ఎమ్మెల్యేకు తొత్తులా వ్యవహరిస్తున్నారు'

author img

By

Published : Sep 28, 2022, 3:35 PM IST

TDP leader JC Prabhakar Reddy

JC Prabhakar Reddy on DSP: తాడిపత్రి ఎమ్మెల్యేకు తొత్తుగా మారిన డీఎస్పీ చైతన్య... తెలుగుదేశం కార్యకర్తలను కేసులతో వేధిస్తున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. తాము ఏ కార్యక్రమం తలపెట్టినా అనుమతివ్వడం లేదని ధ్వజమెత్తారు. తమను వేధిస్తే వచ్చే ఎన్నికల్లో వైకాపా టికెట్ వస్తుందనే ఆశతో డీఎస్పీ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

JC Prabhakar Reddy on DSP: తెదేపా కార్యకర్తలపై తాడిపత్రి డీఎస్పీ చైతన్య అక్రమ కేసులు పెడుతూ ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల వ్యవహారంపై తాడిపత్రిలో జేసీ మండిపడ్డారు. శాంతియుతంగా ఏ కార్యక్రమం చేయాలన్నా అనుమతి నిరాకరించే డీఎస్పీ.. వైకాపాలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గణేష్ విగ్రహం పెట్టాలన్నా, శాంతియుత ఆందోళన చేస్తామన్నా దేనికీ అనుమతి ఇవ్వని డీఎస్పీ.. పద్ధతి మార్చుకోవాలని జేసీ హెచ్చరించారు.

తప్పుడు కేసులతో తమను బెదిరించాలని చూస్తే.. అది సాధ్యం కాదని.. ఇలాంటి బెదిరింపు కేసులు చాలా చూశామని జేసీ అన్నారు. తెదేపా కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్న వారిపై కేసులు పెట్టకుండా.. డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే తమపైనే అక్రమ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఎంత విధేయత చూపినా తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ రాదని జేసీ ప్రభాకర్ రెడ్డి.. డీఎస్పీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

జేసీ ప్రభాకర్‌రెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.