17వ రోజు అమరావతి రైతుల పాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనాలు

author img

By

Published : Sep 28, 2022, 10:21 AM IST

PADAYATRA

PADAYATRA : అమరావతే రాజధానిగా కొనసాగాలని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. అడుగడుగునా ప్రజల ఆశీర్వాదాలు, సంఘీభావాలు, ఘనస్వాగతాలు, హారతుల నడుమ దిగ్విజయంగా సాగుతోంది. ఈ రోజు ఏలూరు సమీపంలోని కొత్తూరు నుంచి ప్రారంభమైన యాత్ర కొవ్వలి వరకు సాగునుంది.

Amaravati Farmers Padayatra : రాజధాని కోసం రైతులు చేస్తున్న పోరాటం నిర్విరామంగా కొనసాగుతోంది. అమరావతి కోసం అన్నదాతలు చేపట్టిన మహాపాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. పాదయాత్రకు తాత్కాలికంగా నిన్న విరామం ఇచ్చిన రైతులు నేడు ఏలూరు సమీపంలోని కొత్తూరు నుంచి ప్రారంభించారు. ఈరోజు ఏలూరు నుంచి కొవ్వలి వరకు 14కి.మీ మేర సాగనుంది.

రైతుల పాదయాత్రకు బాపట్ల జిల్లా చందలూరు రైతులు సంఘీభావం తెలిపారు. మరోవైపు యాత్రకు మద్దతుగా జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. పాదయాత్రకు వివిధ ప్రాంతాల నుంచి దివ్యాంగులు వచ్చి సంఘీభావం తెలిపారు. యాత్రలో తెదేపా నాయకులు నిమ్మల రామానాయుడు, చింతమనేని ప్రభాకర్​, గన్ని వీరాంజనేయులు, బడేటి బుజ్జి, పలువురు పాల్గొన్నారు.

17వ రోజు అమరావతి రైతుల పాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.