ETV Bharat / state

No Rains in Anantapur District: చినుకు జాడ లేదయే.. సాగు చేసేది ఎలా..? ఉమ్మడి అనంత రైతన్న ఆవేదన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2023, 10:20 PM IST

Old Anantapur District Farmers Facing Water Stress Problems: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూరగాయలు సాగు చేస్తున్న రైతులకు వర్షాభావ పరిస్థితుల రూపంలో కష్టాలు తప్పటం లేదు. పంటలను తడుపుకుని కాపాడుకుందామనుకుంటున్న రైతుకు చివరకి కన్నీరే మిగులుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్ధితులు, విద్యుత్​ శాఖ చర్యలు అన్నదాతను మరింత అగాథంలోకి నెడుతున్నాయి. దీంతో కూరగాయల పంటలు సాగు చేయటానికి రైతులు వెనకాడుతున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో కూరగాయల విస్తీర్ణం తగ్గిపోతోంది.

Old_Anantapur_District_Farmers_Facing_Water_Stress_Problems
Old_Anantapur_District_Farmers_Facing_Water_Stress_Problems

No Rains in Anantapur District: చినుకు జాడ లేదయే.. సాగు చేసేది ఎలా..? ఉమ్మడి అనంత రైతన్న ఆవేదన

No Rains in Anantapur District: రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు, విద్యుత్​ కోతలు, అడుగంటుతున్న జల వనరులు రైతులను వెంటాడుతున్నాయి. వాటిని ఎదుర్కొని ముందుకు సాగుదామని ప్రయత్నించిన రైతులకు వెతలు తప్పటం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూరగాయల పంటలు నీటి ఎద్దడికి గురవుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు.. విద్యుత్​ కోతలు రైతులను సతమతం చేస్తున్నాయి. లోటు వర్షపాతం కారణంగా అనంతపురం జిల్లాలో 33 శాతం, సత్యసాయి జిల్లాలో 44 శాతం రైతులను కూరగాయల పంటల సాగుకు దూరం చేసింది. ప్రతియోటా జూన్​ నెలాఖరు నుంచి కూరగాయల సాగు ప్రారంభించే రైతులు.. వాతావరణ ముందస్తు హెచ్చరికలతో వెనకడుగు వేస్తున్నారు.

Old Anantapur District Farmers Facing Water Stress Problems: సాహసంతో పంటలు సాగు చేయటానికి వచ్చిన రైతులకు వాతావరణ, విద్యుత్​ కోతల వల్ల మొండి చేయే మిగులుతోంది. దాదాపు నెల రోజులుగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రాంతంలో చినుకు జాడ లేకుండా పోయింది. కొన్నిచోట్ల బోర్లు ఎండిపోగా, మరికొన్ని చోట్ల భూగర్భ జలాలు పాతాళానికి చేరుకున్నాయి. విద్యుత్​ సరఫరా సరిగా ఉండటం లేదు. పలు చోట్ల నిరంతరాయంగా కనీసం రెండు గంటలు కూడా విద్యుత్​ సరఫరా ఉండటం లేదని అన్నదాతలు ఆవేదనకు లోనవుతున్నారు.

వాతావరణంలో మార్పులు.. కూరగాయల రైతులకు తప్పని నష్టాలు

Crops Dying Due to Drought నీటి తడి లేక పంటలు ఎండిపోతున్నాయి: నీటి ఎద్దడితో ఇప్పటికే చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నాయి. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసుకుంటున్నామని.. పంటలను రక్షించుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నామని రైతులంటున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి.. పంటల పొలాలను తడుపుతూ పంటను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్డీటీ సంస్థ కొన్ని గ్రామాల్లో నీటి ట్యాంకర్ల ద్వారా రైతులకు ఉచిత నీటి తడులను అందించి.. కొంతమేర ఆదుకుంటోంది.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటలు దాదాపు 2 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా.. అందులో 48 వేల హెక్టార్ల కూరగాయల పంటలు పండిస్తున్నారు. కూరగాయల సాగులో సింహభాగం టమాటా సాగు చేస్తున్నారు. తర్వాత బెండ, వంగ, ఉల్లి, చిక్కుడు, బీన్స్​ వంటి తదితర పంటలను పండిస్తున్నారు. అంతేకాకుండా కూరగాయలతోపాటు కొందరు రైతులు ఆకుకూరలను సైతం సాగు చేస్తున్నారు.

చివరికి అందని సాగునీరు.. రోజుకు 5వేల ఖర్చులో తడులు

అనంతపురం జిల్లాలో సుమారు 35 వేల హెక్టార్ల వీస్తీర్ణంలో, సత్యసాయి జిల్లాలోని దాదాపు 13వేల హెక్టార్లలో ప్రతి సంవత్సరం కూరగాయలు సాగు చేస్తుంటారు. దాదాపు ఇక్కడ బోర్ల అధారంగానే పంటలు పండిస్తారు. వర్షాభావ పరిస్థితులతో బోర్లలో నీళ్లు తగ్గిపోవటంతో అధిక పెట్టుబడుల పెట్టి పంటలు సాగు చేశామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

కూరగాయల సాగు వదిలి ఇతర పంటలకు: విద్యుత్​ కోతల వల్ల అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. వర్షాలు లేక విద్యుత్​ అందక బోర్లలో నీళ్లు లేక రైతులు పంటలకు నీటి తడులు అందించలేకపోతున్నారు. కొంతమంది రైతులు నీటి లభ్యతను ముందుగానే అంచనా వేసి కూరగాయల సాగు నుంచి ఇతర పంటలను సాగు చేస్తున్నారు. అరుతడి పంటలైనా కంది, ఆముదం, మొక్కజొన్న లాంటి తదితర పంటలకు మారిపోయారు.

కూరగాయల సాగును ప్రొత్సహించాలి: ఇలాగే వర్షాభావ పరిస్థితులు కొనసాగితే.. ఉల్లి మొదలు ఇతర కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. నీటి లభ్యత ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసి.. అక్కడి రైతులను ప్రొత్సహించాలని వ్యవసాయ శాఖను కోరుతున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో కూరగాయల కొరతను అధిగమించవచ్చని రైతు సంఘాల నేతలు సూచిస్తున్నారు.

'మా గోడు వినండి.. పొగాకు సాగుకు పెట్టుబడి లేదు..'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.