ETV Bharat / state

తాగునీటి కోసం గ్రామస్థుల కష్టాలు

author img

By

Published : Jun 2, 2020, 3:24 PM IST

అసలే రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు... ఉపాధి లేక ప్రజలు ఇళ్లలోనే ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం మునగాల వారి పల్లెలో తాగటానికి నీరు సైతం దొరక్క అవస్థలు పడుతున్నారు.

anantapur dst gandlapenta mandal munagala palle villagers facing drinking water problems
anantapur dst gandlapenta mandal munagala palle villagers facing drinking water problems

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం మునగాల వారి పల్లిలో నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామానికి వచ్చే సత్యసాయి నీటి పథకం పైపులైన్ల మరమ్మతుల వల్ల నీరు సరఫరా కాలేదు. ఫలితంగా మునగలవారి పల్లి వాసులు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. బిందెలు, డ్రమ్ములు తీసుకొని బోరు బావుల ద్వారా ఎడ్ల బండ్లపై నీటిని తెచ్చుకుంటున్నారు.

ఇదిచదవండి: క్షణికావేశం.. కన్నవాళ్లను కడతేర్చింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.