ETV Bharat / sitara

పెళ్లికి సిద్ధమై బ్రేకప్ చెప్పేసుకున్న సెలబ్రిటీలు వీరే!

author img

By

Published : Aug 31, 2021, 3:48 PM IST

Updated : Aug 31, 2021, 5:13 PM IST

Telugu celebrity couples came closer to wedding but called off
మూవీ న్యూస్

మనసులు కలిశాయి. నిశ్చితార్థం జరిగిపోయింది. ఇక మిగిలింది పెళ్లి మాత్రమే. సరిగ్గా ఇలాంటి టైమ్​లో ఏమైందో ఏమో గానీ అంతా తూచ్​ అని విడిపోయారు కొందరు సినీ సెలబ్రిటీలు. వారి గురించే ఈ ప్రత్యేక కథనం.

తెరపై ప్రేమ కల్పితం! కానీ నిజజీవితంలో పలువురు హీరోహీరోయిన్లు, దానిని నిజం చేసి చూపించారు. మరికొందరు మాత్రం.. 'అంతా ఓకే, ఇక పెళ్లి మాత్రమే మిగిలుంది' అనే సమయానికి తమ బంధాన్ని తెగదెంపులుచేసేసుకున్నారు. కారణాలు ఏమైనప్పటికీ, వారి లవ్ మాత్రం​ బ్రేకప్​ అయిపోయింది. ఆ ఇద్దరికే కాకుండా వారి వారి అభిమానులకు కూడా వేదన మిగిల్చింది. ఇంతకీ అలాంటి జంటలు ఏవి? వారు విడిపోవడానికి కారణాలు ఏంటి?

1. ఉదయ్​కిరణ్-సుస్మిత

.
.

2000లో లవర్​బాయ్​ అంటే ఎక్కువగా గుర్తొచ్చే పేరు ఉదయ్​కిరణ్. చేసినవి కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశారు. మెగాస్టార్ చిరంజీవి పెద్దకుమార్తె సుస్మిత, ఉదయ్ ప్రేమించుకున్నట్లు.. 2003లో వీరికి నిశ్చితార్థం కూడా జరిగినట్లు సినీవర్గాల్లో చర్చ సాగింది. కానీ ఏమైందో ఏమో వివాహం మాత్రం జరగలేదు. ఆ తర్వాత ఉదయ్, విషితను.. సుస్మిత, విష్ణు ప్రసాద్​ను పెళ్లిచేసుకున్నారు.

2.రష్మిక-రక్షిత్ శెట్టి

.
.

కన్నడలో 'కిరిక్ పార్టీ'తో హీరోయిన్​గా పరిచయమైన హీరోయిన్ రష్మిక.. అందులో హీరోగా నటించిన రక్షిత్​ శెట్టితో ఏడడుగుల బంధానికి సిద్ధమైంది. కానీ నిశ్చితార్థం జరిగిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు.

3.మెహ్రీన్-భవ్య భిష్ణోయ్

.
.

తెలుగులో హీరోయిన్​గా వరుస సినిమాలు చేసిన మెహ్రీన్.. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్​లాల్ మనవడు భవ్య భిష్ణోయ్​ను వివాహమాడాలని నిశ్చయించుకుంది. అయితే కొన్నాళ్ల తర్వాత, తమ నిశ్చితార్థం రద్దు చేసుకుంటున్నట్లు మెహ్రీన్ సోషల్ మీడియాలో వెల్లడించింది. అలా వీరి బంధానికి తెరపడింది.

4.అఖిల్-శ్రియ

.
.

అక్కినేని హీరో అఖిల్​కు కూడా యుక్త వయసులోనే పెళ్లి అయిపోవాల్సింది. ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్​తో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ అది పెళ్లి వరకు వెళ్లలేదు.

5.తరుణ్-ఆర్తి అగర్వాల్

.
.

నువ్వులేక నేను లేను సినిమా తర్వాత టాలీవుడ్​లో మోస్ట్ రొమాంటిక్ కపుల్​గా తరుణ్-ఆర్తి అగర్వాల్ గుర్తింపు పొందారు. వీరిని జంటగా సినిమాల్లో చూస్తుంటే నిజమైన ప్రేమికుల్లానే కనిపించేవారు. అయితే వీరిద్దరూ గాఢంగా లవ్​ చేసుకున్నారని, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు.

6.ప్రభుదేవా-నయనతార

.
.

దక్షిణాదిలో అన్ని భాషల్లో నటిస్తూ మెప్పిస్తున్న నయనతార గతంలో కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవాతో కొన్నాళ్లు రిలేషన్​ కొనసాగించింది. అతడితో పెళ్లి కోసం మతం మార్చుకోవడానికి కూడా సిద్ధపడింది. కానీ అకస్మాత్తుగా వీరిద్దరూ తమ బంధానికి బ్రేకప్​ చెప్పేసుకున్నారు.

7.త్రిష-వరుణ్

.
.

ముద్దుగుమ్మ త్రిష కూడా గతంలో వరుణ్ అనే పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం చేసుకుంది. కానీ అది వివాహ బంధం వరకు వెళ్లలేదు. ఏమైంది అనే కారణాలు కూడా ఏం వెల్లడించలేదు.

Last Updated :Aug 31, 2021, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.