ETV Bharat / jagte-raho

తుంగభద్రలో ఒకరి గల్లంతు.. ఇద్దరిని కాపాడిన స్థానికులు

author img

By

Published : Oct 9, 2020, 7:58 PM IST

తుంగభద్ర నదిలోని పంప్ హౌస్​కు మరమ్మతుల నిమిత్తం కర్నూలు వచ్చిన ముగ్గురు సిబ్బందిలో ఒకరు గల్లంతైన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో చిక్కుకున్న వారిలో ఇద్దరిని స్థానికులు కాపాడగా మరో వ్యక్తి గల్లంతయ్యాడు.

తుంగభద్రలో ఒకరి గల్లంతు.. ఇద్దరిని కాపాడిన స్థానికులు
తుంగభద్రలో ఒకరి గల్లంతు.. ఇద్దరిని కాపాడిన స్థానికులు

కర్నూలు నగరంలోని తుంగభద్ర నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. తాండ్రపాడుకు చెందిన ముగ్గురు యువకులు తుంగభద్ర నదీ మధ్యలో ఉన్న పంప్​ హౌస్​కు మరమ్మతులు చేపట్టేందుకు కర్నూలుకు వచ్చారు.

ప్రమాదవశాత్తు నీటిలోనే..

ఈ క్రమంలో మరమ్మతుల నిమిత్తం నదిలోకి దిగిన శివ, అఖిల్, శేఖర్ ప్రమాదవశాత్తు నీటిలోనే చిక్కుకుపోయారు. గమనించిన స్థానికులు ఇద్దర్ని రక్షించారు. మూడో వ్యక్తి శేఖర్​కి సకాలంలో సాయం అందకపోవడం వల్ల ప్రవాహంలో గల్లంతయ్యాడు. బాధిత శేఖర్​ కోసం అగ్నిమాపక శాఖ సిబ్బంది గాలింపులు ముమ్మురం చేశారు.

ఇవీ చూడండి : విశాఖ సాగరతీరం.. వ్యర్థాల మయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.