కర్నూలు నగరంలోని తుంగభద్ర నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. తాండ్రపాడుకు చెందిన ముగ్గురు యువకులు తుంగభద్ర నదీ మధ్యలో ఉన్న పంప్ హౌస్కు మరమ్మతులు చేపట్టేందుకు కర్నూలుకు వచ్చారు.
ప్రమాదవశాత్తు నీటిలోనే..
ఈ క్రమంలో మరమ్మతుల నిమిత్తం నదిలోకి దిగిన శివ, అఖిల్, శేఖర్ ప్రమాదవశాత్తు నీటిలోనే చిక్కుకుపోయారు. గమనించిన స్థానికులు ఇద్దర్ని రక్షించారు. మూడో వ్యక్తి శేఖర్కి సకాలంలో సాయం అందకపోవడం వల్ల ప్రవాహంలో గల్లంతయ్యాడు. బాధిత శేఖర్ కోసం అగ్నిమాపక శాఖ సిబ్బంది గాలింపులు ముమ్మురం చేశారు.