ETV Bharat / jagte-raho

అప్పుడు అప్పు తీర్చింది.. ఇప్పుడు ప్రాణం తీసింది..

author img

By

Published : Nov 27, 2020, 3:14 PM IST

సరదాగా మొదలుపెట్టిన ఆన్​లైన్ గేమింగ్.. అలవాటుగా మారింది. ఆ అలవాటే ఆర్థికంగా తను చేసిన రూ.12 లక్షల అప్పు తీర్చింది. అప్పులన్నీ చెల్లించానని.. కాస్త డబ్బు కూడబెడదామనుకుని.. ఆన్​లైన్ గేమ్స్​ ఆడటం కొనసాగించాడు. కానీ.. ఈసారి అది నష్టాలను మిగిల్చింది. ఆ లోటు పూడ్చలేక.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునే వరకు దారితీసింది.

man committed suicide in vanastalipuram
సెల్ఫీ వీడియో

సెల్ఫీ వీడియో

హైదరాబాద్​ వనస్థలిపురంలో ఆన్​లైన్​ గేమ్స్​ ఆడి అప్పులపాలైన జగదీశ్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 'నేను ఆన్​లైన్​ గేమ్స్ ఆడి నష్టపోయాను, నన్ను క్షమించండి' అంటూ భార్యకు సెల్ఫీ వీడియో పంపి ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు.

గతంలో చేసిన అప్పు రూ.12 లక్షలను ఆన్​లైన్​ గేమ్స్ ఆడటం ద్వారా చెల్లించిన జగదీశ్.. ఇప్పుడు అదే గేమ్స్​ ఆడి నష్టపోయాడు. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి :
ఇద్దరు పిల్లలతో కలసి తల్లి ఆత్మహత్య.. మృతదేహాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.