ETV Bharat / crime

విద్యుదాఘాతంతో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి మృతి

author img

By

Published : Oct 22, 2022, 6:32 PM IST

విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి
young man died with electrical shock

ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉందామనుకున్న ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి కల.. కలగానే మిగిలింది. నిర్మాణ దశలో ఉన్న తన ఇంటికి పైపుతో నీటిని పడుతుండగా ప్రమాదవశాత్తు రషీద్ అనే యువకుడు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ప్రియాంక నగర్ లో జరిగింది.

రషీద్ అనే సాఫ్ట్​వేర్​ ఉద్యోగి విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. నిర్మాణ దశలో ఉన్న తన ఇంటికి పైపుతో నీటిని పడుతుండగా ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ప్రియాంక నగర్ లో జరిగింది. కొత్తగా నిర్మాణంలో ఉన్న తన ఇంటి సిమెంట్ దిమ్మెలకు పైపుతో నీటిని పెడుతుండగా అకస్మాత్తుగా మోటర్ నుంచి విద్యుత్ ప్రవహించడంతో రషీద్ అక్కడిక్కక్కడే మృతి చెందాడు. బెంగళూరులో ఉద్యోగం చేసే రషీద్ ఇంటి వద్దనే ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడని రెండేళ్ల క్రితమే ఇతనికి వివాహమైందని స్థానికులు తెలిపారు. రషీద్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.