ETV Bharat / crime

WOMEN SUICIDE: ఫోన్​ ఎక్కువగా మాట్లాడొద్దని చెప్పినందుకు యువతి ఆత్మహత్య

author img

By

Published : Sep 1, 2021, 10:18 AM IST

women-suicide-in-chittoor-district
ఫోన్​ ఎక్కువగా మాట్లాడొద్దని చెప్పినందుకు యువతి ఆత్మహత్య

ఫోన్​ ఎక్కువగా చూస్తుందని... కుటుంబ సభ్యులు మందలించడంతో ఓ యువతి ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా బసినికొండలో జరిగింది.

చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం బసినికొండలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఫ్యాన్​కి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన ఎస్‌.సల్మా(17)... ఈ మధ్య ఫోన్​ ఎక్కువగా మాట్లాడుతోంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు తరచూ ఫోన్​ వాడొద్దని, ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావు అంత సేపంటూ మందలించారు.

కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెందిన సల్మా ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దు అన్నందుకే కూతురు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: Bandla Ganesh: నాకెందుకు ఇస్తారయ్యా నోటీసులు... నేనసలు వక్కపోడే వేసుకోను!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.