ETV Bharat / crime

Bandla Ganesh: నాకెందుకు ఇస్తారయ్యా నోటీసులు... నేనసలు వక్కపోడే వేసుకోను!

author img

By

Published : Sep 1, 2021, 9:17 AM IST

టాలీవుడ్​లో మళ్లీ మత్తుమందుల విచారణ మొదలైంది. నాలుగేళ్ల క్రితం తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన డ్రగ్స్ వ్యవహారం మళ్లీ తెరమీదకొచ్చింది. విచారణకు హాజరుకావాల్సిందిగా పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అందులో భాగంగా మంగళవారం దర్శకుడు పూరీ జగన్నాథ్​ను ఈడీ అధికారులు విచారించారు. పూరీని విచారిస్తుండగా ఈడీ కార్యాలయంలో నిర్మాత బండ్ల గణేశ్​ ప్రత్యక్షమయ్యారు.

bandla-ganesh-came-to-the-ed-office-while-puri-was-interrogating-jagannath
నాకెందుకు ఇస్తారయ్యా నోటీసులు... నేనసలు వక్కపోడే వేసుకోను!

టాలీవుడ్ మత్తు మందుల కేసు (Tollywood Drugs Case) తొలిరోజు విచారణలో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ED) ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్​(Puri Jagannath)ను విచారిస్తుండగా ఈడీ కార్యాలయంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్​ (Bandla Ganesh) ప్రత్యక్షమయ్యారు. ఆయన ఈడీ కార్యాలయానికి రావడం వల్ల అధికారులు ఆయన్నీ పిలిచినట్లు ప్రచారం జరిగింది. అక్కడ మీడియా ప్రతినిధులు ఈడీ ఏమైనా మీకు నోటీసులిచ్చిందా అని అడగ్గా... గణేశ్​ స్పందిస్తూ... నాకు వక్కపోడే తెలియదు. ఈడీ నాకెందుకు నోటీసులు ఇస్తుందని ఎదురుప్రశ్న వేశారు. తాను కేవలం పూరీని పలకరించడానికి మాత్రమే వచ్చినట్లు చెప్పారు.

చాలాసేపు అయిందని పూరీ జగన్నాథ్​ను కలవడానికి వచ్చాను. నాకెందుకు ఇస్తారయ్యా నోటీసులు? నేను వక్కపొడి కూడా వేసుకోను.

- బండ్ల గణేశ్​, నిర్మాత

బండ్ల గణేశ్​... పూరీ జగన్నాథ్​ను కలిసేందుకు ప్రయత్నించినా అధికారులు ఆయనను అనుమతించలేదు. అక్కడే ఆయన కాసేపు నిరీక్షించారు. దీంతో కొద్దిసేపు కార్యాలయ ఛాంబర్‌లో కూర్చుని పూరీ తనయుడు ఆకాశ్‌తో మాట్లాడినట్లు తెలిసింది. ఈడీ అధికారులు కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని బండ్ల గణేశ్​కు చెప్పగా ఆయన అక్కడి నుంచి రాత్రి 7.45 గంటలకు వెళ్లిపోయారు.

ఇదీ చూడండి: tollywood drugs case: ముగిసిన పూరీ ఈడీ విచారణ.. అవసరమైతే మరోసారి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.