ETV Bharat / crime

వివాదాల కారణంగా.. పెందుర్తిలో భర్తను హత్యచేసిన భార్య

author img

By

Published : Dec 15, 2022, 12:35 PM IST

WIFE KILLED HUSBAND IN VISAKHA
WIFE KILLED HUSBAND IN VISAKHA

WIFE KILLED HUSBAND IN VISAKHA : ఆ భార్య భర్తల మధ్య కొంతకాలంగా విడాకులకు సంబంధించిన అంశం కోర్టులో నడుస్తోంది. ఆ విషయంపై తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఆగ్రహం చెందిన భార్య.. రాడ్​తో భర్త తలపై కొట్టి హతమార్చింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

WIFE KILLED HUSBAND: రాడ్​తో భర్తను హత్యచేసిన భార్య పోలీసులకు లొంగిపోయిన ఘటన విశాఖలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెందుర్తి మండలం లక్ష్మీపురంలో నాగేశ్వరరావు, జగదీశ్వరిలకు మధ్య విడాకుల కేసు కొంతకాలంగా కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో భర్త నాగేశ్వరరావు.. భార్యను విడాకుల విషయంలో మళ్లీ గొడవ జరుగుతుండటంతో కోపోద్రిక్తురాలైన ఆమె రాడ్‌తో తలపై కొట్టడంతో.. నాగేశ్వరరావు ప్రాణాలు కోల్పోయాడు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వివాదాల కారణంగా.. పెందుర్తిలో భర్తను హత్యచేసిన భార్య

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.