ఎన్టీఆర్​ జిల్లాలో దారుణం.. తల్లిని చంపిన కొడుకు

author img

By

Published : Jul 30, 2022, 4:21 PM IST

murder

MURDER: సమాజంలో రోజురోజుకి మానవ సంబంధాలకు విలువలేకుండా పోతోంది. తల్లి మందలించిందని, తండ్రి కొట్టాడని కోపం పెంచుకుని వారిని హతమారుస్తున్నారు. పున్నామా నరకం నుంచి రక్షించాల్సిన కొడుకే విచక్షణారహితంగా దాడి చేసి చంపుతున్నారు. తాజాగా మానసిక స్థితి సరిగాలేని ఓ కుమారుడు తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన ఎన్టీఆర్​ జిల్లాలో జరిగింది.

MURDER: అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలు మనిషి జీవన ప్రమాణాలను దెబ్బతీస్తాయి. చిన్న చిన్న విబేధాల కారణంగా కోపోద్రిక్తులై తనువులు చాలించడమో లేక ఇతరులను చంపడమో చేస్తున్నారు. తాజాగా మానసిక స్థితి బాగాలేని కొడుకు తల్లితో గొడవపడ్డాడు. ఆ సమయంలోనే విచక్షణ కోల్పోయి దాడి చేశాడు. ఈ ఘటన ఎన్టీఆర్​ జిల్లాలో జరిగింది.

తిరువూరు మండలం ఎరుకుపాడుకు చెందిన చింతల నాగేంద్రబాబుకు మతిస్తిమితం సరిగా లేదు. తల్లి మంగమ్మతో గొడవపడిన అతను.. పారతో కొట్టి, గొంతు నులిమి హతమార్చాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరూవురు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.