విశాఖ రౌడీషీటర్​ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్​

author img

By

Published : Aug 18, 2022, 10:12 PM IST

rowdy sheeter

Three persons arrest విశాఖలో దారుణహత్యకు గురైన అనీల్​ కేసును పోలీసులు ఛేదించారు. బస్​ డ్రైవర్​ శ్యామ్​ హత్య చేశాడని తెలిపారు. పాతకక్షలతోనే హత్య జరిగిందని ఈ హత్యలో ముగ్గురిని అరెస్ట్​ చేసినట్లు ప్రకటించారు.

Rowdy sheeter murder case: విశాఖ ఎంవీపీ కాలనీలో బుధవారం జరిగిన రౌడీషీటర్ బొడ్డు అనీల్ కుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అప్పుఘర్ ప్రాంతానికి చెందిన బస్ డ్రైవర్ వాసుపల్లి శ్యామ్ అనే వ్యక్తి.. నగరానికి చెందిన ఎర్రయ్య, సమీర్​లతో కలిసి హత్య చేసినట్టు గుర్తించామని క్రైమ్ డీసీపీ గంధం నాగన్న తెలిపారు. మృతుడు అనీల్ స్థానికంగా రౌడీయిజం చేస్తూ వేధించడంతోనే.. శ్యామ్ హత్య చేసినట్టు పోలీసుల విచారణలో నిర్ధారణైనట్లు తెలిపారు. స్థానిక అనుపమ బార్​లో మద్యం సేవించడానికి వెళ్ళిన సమయంలో శ్యామ్.. అనీల్ మధ్య ఘర్షణ చోటు చేసుకుందని.. బార్ నుంచి బయటకు వచ్చినప్పుడు కత్తితో పొడిచి శ్యామ్ చంపి పరారైనట్లు తెలిపారు.

పాతకక్షలే హత్యకు ప్రధాన కారణం. హత్యకు గురైన కార్ డ్రైవర్ అనీల్​పై కాకినాడలో రౌడీ షీట్ ఉంది. హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నాం. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలిస్తాం. -గంధం నాగన్న, డీసీపీ క్రైమ్ విశాఖ సిటీ

అసలేం జరిగింది: విశాఖ అప్పుఘర్‌కు చెందిన బి.అనిల్‌కుమార్‌ (36), ఎంవీపీ కాలనీ ఆదర్శనగర్‌లో ఉంటున్న శ్యామ్‌ప్రకాశ్‌ స్నేహితులు. కారు డ్రైవర్‌గా పనిచేసే అనిల్‌కుమార్‌ రౌడీషీటర్‌ కాగా బస్సుడ్రైవర్‌ శ్యామ్‌ప్రకాశ్‌పై 498ఎ కేసు ఉంది. ఓ హత్య కేసులో నిందితుడైన అనిల్‌కుమార్‌పై కాకినాడ రెండో పట్టణ పోలీసుస్టేషన్లో రౌడీషీట్‌ కూడా ఉంది. తన గురించి అనిల్‌కుమార్‌ హేళనగా మాట్లాడుతున్నట్లు తెలిసిన శ్యామ్‌ప్రకాశ్‌ అతనిపై కోపం పెంచుకున్నాడు. గతంలో క్రికెట్‌ ఆడుతూ.. ఇద్దరూ గొడవపడినప్పటికీ చుట్టుపక్కలవారు రాజీ చేయడంతో మళ్లీ స్నేహితులయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఉషోదయ కూడలిలోని అనుపమ బార్‌లో అనిల్‌కుమార్‌, శ్యామ్‌ప్రకాశ్‌, షమీర్‌, ఎర్రయ్య అనే నలుగురు మిత్రులు మద్యం తాగారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో వారిలో ఒకరు బయటకు వెళ్లి మళ్లీ వచ్చారు. సాయంత్రం 4 నుంచి 4.30 గంటల మధ్యలో బార్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత మళ్లీ అనిల్‌తో వాగ్వాదం జరిగింది. అనంతరం తోపులాటతోపాటు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆ తరువాత శ్యామ్‌ప్రకాశ్‌, మరొకరు కలిసి అనిల్‌పై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. దవడలపై, ఎడమభుజంపై, ఛాతీ, పొట్టపైనా పొడిచి, పీక కోసి అక్కడ నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావమవడంతో అనిల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

స్థానిక యువకులతోనూ వివాదాలు: అనిల్‌కుమార్‌కు స్థానిక యువకులు కొందరితో విభేదాలున్నాయి. అయితే రౌడీషీటర్‌ కావడంతో వారి అసంతృప్తిని బయటకు చెప్పలేకపోయేవారు. మరోవైపు బుధవారం కూడా అనిల్‌ తనను అవమానించేలా మాట్లాడటాన్ని శ్యామ్‌ప్రకాశ్‌ జీర్ణించుకోలేకపోయాడు. అప్పటికప్పుడు హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పక్కా ప్రణాళిక ప్రకారం అనిల్‌ను బార్‌కు తీసుకొచ్చేరేమోనన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. మధ్యలో ఓ వ్యక్తి కత్తి కోసమే బయటకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. శ్యామ్‌ప్రకాశ్‌ను అనిల్‌ హేళనగా మాట్లాడటం, బార్‌లో పాత వివాదాలు చర్చకు రావడం హత్యకు దారితీసినట్లు ద్వారకా సబ్‌డివిజన్‌ ఏసీపీ ఆర్‌.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.