ETV Bharat / city

చనిపోయిన తండ్రికి గుడి కట్టి నిత్య పూజలు

author img

By

Published : Nov 14, 2020, 5:15 PM IST

సాధారణంగా ఇష్టమైన రాజకీయ నాయకుడి విగ్రహాన్ని అభిమానులు ఏర్పాటు చేయడం సహజం. ఇటీవల సినీతారల విగ్రహాలు సైతం వెలుస్తున్నాయి. అయితే తల్లిదండ్రుల విగ్రహాలను ఏర్పాటు చేసుకునే వాళ్లు చాలా అరుదు. అలాంటి వ్యక్తుల్లో ఒకడే విశాఖకు చెందిన దాసు. చనిపోయిన తండ్రికి గుర్తుగా విగ్రహం తయారు చేయించి.. ఓ గుడి కట్టి పూజలు చేస్తున్నాడు.

son built temple for father
son built temple for father

చనిపోయిన తండ్రికి గుడి కట్టి నిత్య పూజలు

తమను విడిచి కానరాని లోకాలకు వెళ్లిన తండ్రి జ్ఞాపకార్థం ఓ గుడిని నిర్మించాడు తనయుడు. అందులో తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్య పూజలు చేస్తున్నాడు. విశాఖలోని ఎంవీపీ కాలనీని అనుకుని ఉన్న మత్స్యకారవాడకు చెందిన వాసుపల్లి దాసు ఏఆర్ కానిస్టేబుల్​గా పని చేస్తున్నాడు. ఆయన తండ్రి వాసుపల్లి దేముడు ఈ ఏడాది జులైలో గుండెపోటుతో ఇంటి ముందే కన్నుమూశారు. అదే ప్రదేశంలో తన తండ్రికి గుడి కట్టించాడు దాసు. తన సోదరులు, సోదరీలు కూడా గుడి నిర్మాణానికి ప్రోత్సహించారని ఆయన వెల్లడించారు.

తన తండ్రి ఏడుగురు సంతానాన్ని కష్టపడి పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా మార్చారని దాసు వివరించారు. తమ అభ్యున్నతి కోసం శ్రమించిన తండ్రిని నిరంతరం తలచుకోవడానికి ఈ గుడి ఉపకరిస్తోందని చెప్పారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కనీసం పట్టించుకోని మనుషులు ఉన్న ఈ కాలంలో... చనిపోయిన తండ్రికి గుడి కట్టి పూజలు చేస్తున్న దాసును స్థానికులు కొనియాడుతున్నారు.

ఇదీ చదవండి

ట్రాక్టరెక్కి పొలం దున్నిన ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.