ETV Bharat / city

DRUGS AT VISAKHA: విశాఖలో డ్రగ్స్ కలకలం.. నలుగురు అరెస్టు

author img

By

Published : Jan 31, 2022, 12:59 PM IST

Updated : Jan 31, 2022, 1:28 PM IST

drugs
drugs

12:55 January 31

మాత్రల రూపంలో తరలిస్తున్న డ్రగ్స్‌ను గుర్తించిన పోలీసులు

Drugs caught at Visakha: విశాఖలో మరోసారి మాదక ద్రవ్యాల సరఫరా కలకలం రేపాయి. హైదరాబాద్‌ నుంచి మాదక ద్రవ్యాలు తీసుకొస్తున్న యువతిని ఎన్​ఏడీ జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్​కు చెందిన గీత, మాలవ్య, విశాఖకు చెందిన హేమంత్, రాజాంకు చెందిన డాక్టర్ పృథ్వీ నలుగురికి గోవాలో పరిచయం ఏర్పడింది. హైదరాబాద్‌కు చెందిన గీత, మాలవ్య ద్వారా విశాఖలో ఉన్న హేమంత్‌కు మాదక ద్రవ్యాలు పంపించింది. ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులు.. ఎన్​ఏడీ జంక్షన్ వద్ద ఇద్దరినీ పట్టుకున్నారు. పృథ్వీని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 18 ఎమ్​ఎమ్​డీఏ పిల్స్‌, 2 ఎమ్​ఎమ్​డీఏ క్లిస్టర్ పౌడర్ , 20వేల నగదు, కారు స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఇదీ చదవండి: విలాసాల మోజులో బంధం నిర్లక్ష్యం.. భర్తను హత్య చేయించిన భార్య..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated :Jan 31, 2022, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.