ETV Bharat / city

కొవిడ్ బాధితుల సమస్యలకు 4 గంటల్లోనే పరిష్కారం: మంత్రి వెల్లంపల్లి

author img

By

Published : Apr 25, 2021, 3:22 PM IST

vellampalli on covid call center
కొవిడ్ బాధితుల సమస్యలకు 4 గంటల్లోనే పరిష్కారం

కరోనా బాధితులకు 104 కాల్ సెంట్రల్ ద్వారా సేవలు అందిస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కాల్ సెంటర్ ద్వారా 4 గంటల్లోనే ప్రజల సందేహాలు, సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు.

కొవిడ్ బాధితుల సమస్యలకు 4 గంటల్లోనే పరిష్కారం

కొవిడ్‌ బాధితుల సమస్యలకు 104 కాల్ సెంటర్‌ ద్వారా 4 గంటల్లోనే పరిష్కారం చూపాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయవాడ సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ను ఆయన సందర్శించి, పనితీరును పరిశీలించారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పడకల కొరత పెద్దగా లేదన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామమని..,రోగులకు కావాల్సిన ఆక్సిజన్ అందిస్తామని తెలిపారు.

ఇదీచదవండి: 48 గంటల్లో జిల్లాలకు ట్రూనాట్‌ కిట్లు: కొవిడ్‌ నోడల్‌ అధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.