ETV Bharat / city

పది వేలు ఇచ్చి.. పదింతలు వసూలు చేస్తున్నారు: వంగలపూడి అనిత

author img

By

Published : Jul 15, 2022, 2:53 PM IST

TDP ANITHA
TDP ANITHA

TDP ANITHA: వాహనమిత్ర పేరిట ఇస్తున్న పది వేల రూపాయలు ఆటో రిపేర్లకు చాలవని తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత విమర్శించారు. 2 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్‌ వాడే జగన్‌కు.. రోడ్ల దుస్థితి ఏం తెలుస్తుందని ఆమె ఎద్దేవా చేశారు.

TDP ANITHA: రెండు కిలోమీటర్ల ప్రయాణానికి కూడా హెలికాఫ్టర్ వాడే సీఎంకి రోడ్ల పరిస్థితి ఎలా తెలుస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాల వంగలపూడి అనిత విమర్శించారు. వాహనమిత్రకు డబ్బులిచ్చే ముందు.. ఓ ఆటోలో రోడ్లపై తిరిగి వస్తే డ్రైవర్ల కష్టాలు తెలుస్తాయని విమర్శించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్​లోనే అధికంగా ఉన్నాయని ఆరోపించారు. రెండు కిలోమీటర్లలోపు గతుకులు లేని రహదారి రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా అని నిలదీశారు. జనాల్ని పీడించటంలో జగన్ రెడ్డి నెంబర్1 అని అనిత ధ్వజమెత్తారు. రాష్ట్రంలో డ్రైవర్లు 10లక్షల మందికి పైగా ఉంటే.. కేవలం 2లక్షల మందికే వాహనమిత్ర ఇచ్చి, అందరినీ ఉద్ధరిస్తున్నట్లు చెప్పటం సిగ్గుచేటని అన్నారు. పది వేలు ఇచ్చి.. పన్నులు, చలానాల రూపేణా పదింతలు వసూళ్లు చేస్తున్నారని దుయ్యబట్టారు.

పది వేలు ఇచ్చి.. పదింతలు వసూలు చేస్తున్నారు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.