ETV Bharat / city

రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి.. జగన్‌ కంకణం కట్టుకున్నారు: లోకేశ్‌

author img

By

Published : Mar 26, 2022, 3:55 PM IST

lokesh
సీఎం జగన్‌ రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి కంకణం కట్టుకున్నారు:లోకేశ్‌

Lokesh fires on YSRCP: సీఎం జగన్, ఆయ‌న పార్టీ నేత‌లు రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికే కంకణం కట్టుకున్నారని.. తెదేపా నేత నారా లోకేశ్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో మహిళ హత్య.. వైకాపా అరాచ‌కాల‌కు ప‌రాకాష్ట అన్నారు. మ‌హిళ‌ల‌కు సీఎం ఇచ్చే భ‌ద్రత‌ ఇదేనా? అని నిలదీశారు.

  • చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కొంగావారిపల్లికి చెందిన గాజుల వ్యాపారి రమణమ్మని ఆర్థిక వ్య‌వ‌హారాల‌లో ఏర్ప‌డిన వివాదంతో వైసీపీ నేత ఎన్. వెంకట్రమణారెడ్డి అతి దారుణంగా కొట్టి చంప‌డం రాష్ట్రంలో వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ అరాచ‌కాల‌కి ప‌రాకాష్ట‌.(2/4)

    — Lokesh Nara (@naralokesh) March 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Lokesh fires on YSRCP: ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి, ఆయ‌న పార్టీ నేత‌లు రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికే కంకణం కట్టుకున్నారని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. ప్రజ‌లు అధికారం ఇచ్చింది క‌బ్జాలు, దోపీడీలు చేయడానికే అన్నట్టు దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కొంగావారిపల్లికి చెందిన వ్యాపారి రమణమ్మని.. స్థానిక అధికార పార్టీ నేత అతి దారుణంగా కొట్టి చంప‌డం వైకాపా అరాచ‌కాల‌కు ప‌రాకాష్ట అన్నారు. మ‌హిళ‌ల‌కు సీఎం ఇచ్చే భ‌ద్రత‌ ఇదేనా? అని నిలదీశారు. అండ‌గా నిల‌వాల్సిన‌ ప్రభుత్వమే అంత‌మొందిస్తుంటే, న్యాయం చేయాల్సిన పోలీసులు అన్యాయంగా వ్యవ‌హ‌రిస్తుంటే.. రాష్ట్ర ప్రజ‌ల ప్రాణాల‌కు దేవుడే దిక్కని లోకేశ్‌ ట్విటర్ వేదికగా అన్నారు.

  • ఇదేనా ముఖ్య‌మంత్రి మ‌హిళ‌ల‌కు మీరిచ్చే భ‌ద్ర‌త‌? అండ‌గా నిల‌వాల్సిన‌ ప్ర‌భుత్వమే అంత‌మొందిస్తుంటే, న్యాయం చేయాల్సిన పోలీసులు అన్యాయంగా వ్య‌వ‌హ‌రిస్తుంటే..రాష్ట్ర‌ప్ర‌జ‌ల ప్రాణాల‌కి దేవుడే దిక్కు.(4/4)

    — Lokesh Nara (@naralokesh) March 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

శ్రీకాకుళంలో దారుణం.. నడిరోడ్డుపై వ్యక్తి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.