నాన్సెన్స్ మాట్లాడొద్దు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీపై వైకాపా ఎమ్మెల్యే ఫైర్

author img

By

Published : Sep 24, 2021, 2:28 PM IST

malladi vishnu fires on mlc
malladi vishnu fires on mlc ()

అతనో అధికార పార్టీ ఎమ్మెల్యే. అతనితో పాటే తోటి ప్రజాప్రతినిధులు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశంలో ఓ ఎమ్మెల్సీ సీపీఎస్ గురించి ప్రస్తావించారు. దీనిపై ఆ ఎమ్మెల్యేకు కోపం తన్నుకొచ్చింది. నాన్సెన్స్ మాట్లాడొద్దు .. మీ వల్ల ఏమవుతుంది? అంటూ సదరు ఆ ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు.

నాన్సెన్స్ మాట్లాడొద్దు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీపై వైకాపా ఎమ్మెల్యే ఫైర్

సీపీఎస్ గురించి ప్రస్తావించిన ఓ ఉపాధ్యాయ ఎమ్మెల్సీపై వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు నాన్సెన్స్ మాట్లాడొద్దంటూ దుర్భాషలాడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడలో ఈ నెల 22వ తేదీన జరిగిన ఓ కార్యక్రమంలో మల్లాది విష్ణు తోటి ప్రజాప్రతినిధిపై తీవ్రస్థాయిలో ధూషణలకు దిగిన వీడియో వైరల్ గా మారింది. మల్లాది విష్ణు ప్రసంగిస్తున్న సమయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు సీపీఎస్ గురించి ప్రస్తావించినప్పుడు ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇదీ చదవండి: ఒడిశా పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ.. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని ఏపీకి ఆదేశం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.