ETV Bharat / city

Alai-Balai 2021: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా అలయ్ బలయ్.. హాజరైన ప్రముఖులు

author img

By

Published : Oct 17, 2021, 2:42 PM IST

హైదరాబాద్ జలవిహార్‌లో అలయ్-బలయ్(Alai-Balai 2021) కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతోంది. దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలయ్‌బలయ్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ తమిళిసై సహా సినీరాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

alai balai program 2021 news
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా అలయ్ బలయ్.. హాజరైన ప్రముఖులు

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​(hyderabad)లోని జలవిహార్‌(jala vihar)లో అలయ్‌ బలయ్‌(alai-babali) కార్యక్రమం సందడిగా జరుగుతోంది. హరియాణా గవర్నర్‌(haryana governer) దత్తాత్రేయ(dattatreya) కుమార్తె విజయలక్ష్మి(vijayalakshmi) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు(vice president venkaiah naidu), గవర్నర్‌ తమిళిసై(telangana governer tamilisai), హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌(himachal pradesh governer rajendra vishwanath), జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (janasena chief pawan kalyan), భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల(bharat biotech chairman krishna ella), భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌(bjp leader lakshman), ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు('maa' president manchi vishnu), ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(actor kota srinivas rao), తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు దత్తాత్రేయ, కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు.

alai balai program 2021 news
మహిళలతో తెలంగాణ గవర్నర్ నృత్యాలు

అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో భాగంగా తమిళిసై సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో కలిసి నృత్యం చేశారు. కార్యక్రమంలో భాగంగా దుర్గామాత, జమ్మిచెట్టుకు వెంకయ్యనాయుడు పూజలు చేశారు. ఇందులో దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆలింగనాలతో కాకుండా నమస్కారాలతో అలయ్‌ బలయ్‌ను జరుపుతున్నారు. ప్రముఖులు హాజరైన దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ పర్యవేక్షిస్తున్నారు.

alai balai program 2021 news
పాల్గొన్న పవన్ కల్యాణ్

ప్రముఖులకు సన్మానం..

జలవిహార్‌లో నిర్వహిస్తోన్న అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పలువురు ప్రముఖులను సన్మానించారు. భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబోరేటరీస్‌ అధినేత ప్రసాద్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి, బయోలాజికల్‌-ఇ ఎండీ మహిమ దాట్ల, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సన్మానించారు.

alai balai program 2021 news
అలయ్ బలయ్ కార్యక్రమం, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభించిన గవర్నర్

ఇదీ చదవండి:

South Central Railway: దసరా ప్రయాణికుల కోసం.. నేడు, రేపు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.