ETV Bharat / city

వారం పాటు పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు

author img

By

Published : Jun 6, 2020, 4:25 PM IST

వారం పాటు పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు
వారం పాటు పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అమెరికన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపును ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. కరోనా కట్టడిలో ముందుండి సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వారంపాటు వైద్య పరీక్షలు చేయిస్తున్నామని ఆయన తెలిపారు.

కరోనా నియంత్రణలో ఫ్రంట్​లైన్ వారియర్స్​ అయిన పారిశుద్ధ్య కార్మికులకు విజయవాడలో ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తున్నారు. నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన మెడికల్​ క్యాంపును బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంపులో పారిశుద్ధ్య కార్మికులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆ వివరాలు నమోదు చేసి... ఆరు నెలల తర్వాత మరోమారు ఆరోగ్య పరీక్షలు చేస్తామని మల్లాది విష్ణు తెలిపారు.

నగరంలో ఉన్న 3600 మంది పారిశుద్ధ్య కార్మికులకు క్యాంపు ద్వారా ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నామన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ మెడికల్ క్యాంపును పారిశుద్ధ్య కార్మికులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 3600 మందిలో ఓ వెయ్యి మందికి వైద్య పరీక్షలు చేసేందుకు ముందుకొచ్చిన అమెరికన్​ ఆసుపత్రి(సెయింట్​ ఆన్స్) సిబ్బందిని మల్లాది విష్ణు అభినందించారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 210 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.