ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 210 కరోనా పాజిటివ్‌ కేసులు

author img

By

Published : Jun 6, 2020, 12:54 PM IST

Updated : Jun 6, 2020, 1:17 PM IST

210-more-corona-positive-cases-registered-in-ap
210-more-corona-positive-cases-registered-in-ap

12:48 June 06

కొత్తగా 210 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 12,771 మంది నమూనాలు పరీక్షించగా 210 పాజిటివ్‌ కేసులు నిర్ధరణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 49 ఉండగా.. రాష్ట్రంలో 161 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 4,460 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 73. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 2,323కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1192 మంది చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి

9న సీఎం జగన్​తో సినీ ప్రముఖుల సమావేశం

Last Updated : Jun 6, 2020, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.