ETV Bharat / city

CM JAGAN SHIMLA TOUR: సీఎం సిమ్లా టూర్.. ఐదు రోజులు అక్కడే..!

author img

By

Published : Aug 26, 2021, 10:50 AM IST

Updated : Aug 26, 2021, 12:26 PM IST

ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబసభ్యులతో కలిసి సిమ్లా పర్యటనకు బయల్దేరారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా అక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సీఎం సందర్శించనున్నారు.

cm jagan shimla tour
cm jagan shimla tour

ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే సీఎం జగన్.. కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయం గడపనున్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి సిమ్లా టూర్​కు వెళ్లారు. తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి తన ఫ్యామిలీతో కలిసి చండీగఢ్, అక్కడి నుంచి సిమ్లా వెళ్లనున్నారు. సిమ్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. సీపీ బత్తిన శ్రీనివాస్, డీసీపీ హర్షవర్ధన్, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, తదితరులు పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించారు.

సీఎం జగన్​ వివాహం జరిగి ఆగస్టు 28కి సరిగ్గా 25 ఏళ్లు. ఈ సందర్భంగా సీఎం తన కుటుంబసభ్యులతో కలిసి ఈ టూర్ ప్లాన్ చేసుకున్నారని సమాచారం. ఆగస్టు 26 నుంచి 31 వరకూ ఆయన కుటుంబంతో అక్కడే గడపనున్నారు. సెప్టెంబరు 1న ఆయన రాష్ట్రానికి తిరిగి వస్తారు.

ఇదీ చదవండి: RAINS: రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు..జలమయమైన రోడ్లు

Last Updated :Aug 26, 2021, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.