ETV Bharat / state

RAINS: రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు..జలమయమైన రోడ్లు

author img

By

Published : Aug 26, 2021, 6:57 AM IST

Updated : Aug 26, 2021, 11:41 AM IST

rains
rains

నైరుతి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు(rains) కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఉరుముల, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రంలో పశ్చిమ-నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రత్యేకించి ఉత్తర, దక్షిణ కోస్తాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా చోట్ల వాతావరణం పొడిగా ఉంటుందని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు..జలమయమైన రోడ్లు

రోడ్లన్నీ జలమయం..

విజయవాడలో బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో బందరు రోడ్డులో భారీ వృక్షం నేలకొరిగింది.

ప్రకాశం జిల్లా వేటపాలెం,చినగంజాం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చీరాల పట్టణంలో అర్ధరాత్రి మూడు గంటలసేపు పైగా కురిసిన భారీ వర్షానికి రహదార్లు జలమయమయ్యాయి. అర్ధరాత్రి ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం భయానకంగా మారింది. పట్టణమంతా తడిచిముద్దయింది. కారంచేడు, చీరాల ప్రాంతాలో 10 సెంటిమీటర్లు, రాజధాని ప్రాంతంలో తాడికొండ, రాయపూడి, తుళ్లూరు, గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల తదితర ప్రంతాల్లో 8 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది.

గుంటూరు జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రెండున్నర గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైన వర్షపు నీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. కాల్వలు వర్షపునీటితో ఉదృతంగా పారాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు జిల్లాలో సగటున 37.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.

ఈదురు గాలులకు నేలవాలిన భారీ వృక్షం
గుంటూరు నగరంలో బుధవారం అర్థరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి బృందావనగార్డెన్స్‌లోని భారీ వృక్షం నేలవాలింది. వృక్షం పక్కనే ఉన్న విద్యుత్‌ తీగలపై పడటంతో తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన విద్యుత్‌ శాఖ.. తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేసింది. వెంటనే తీగలను సరిచేసి ప్రత్యామ్నాయ మార్గంలో విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించారు.

గురువారం ఉదయాన్నే చెట్ల కొమ్మలను తొలగించి, విద్యుత్‌ తీగలను సక్రమంగా అమర్చేందుకు అటు..విద్యుత్‌ శాఖ, నగరపాలక సంస్థ అధికారులు పనులను ప్రారంభించారు. రోడ్డుపైన వృక్షం పడటంతో ఉదయాన ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. క్రేన్‌ సాయంతో చెట్ల కొమ్మలను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు పనులు జరుగుతున్నాయి.

నీట మునిగిన పాఠశాల

విజయవాడ నగరానికి కూతవేటు దూరంలోనే ఎనికేపాడు తాతాపురం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల గత రాత్రి కురిసిన భారీ వర్షానికి నీట మునిగింది. సుమారు రెండు వందల మంది చిన్నారులు ఈ పాఠశాలలో విద్యనభ్యసిస్తుండగా ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇలా మోకాలు లోతు నీటిలో పాఠశాల మునిగిపోతుందని, స్థానికంగా డ్రైనేజీలు నిర్మించుకోకుండా.. భారీ భవనాలు నిర్మించడం.. పాఠశాల ప్రాంగణం పల్లంగా మారీ వర్షాలకు ముంపునకు గురవుతుందని స్థానికులు తెలిపారు. కాగా మోటార్ సాయంతో నీటిని తోడి వేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేస్తామని పాఠశాల ఉపాధ్యాయలు తెలిపారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఈ పాఠశాలను త్వరలో ఆధునీకరణ జరిగే అవకాశం ఉన్నట్లుగా ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు.

రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇబ్రహీంపట్నం ఖాజీ నగర్ ముంపుకు గురైంది

ఇదీ చదవండి: rains: రాగల 24గంటల్లో రాష్ట్రంలో ఆ ప్రాంతాల్లో వర్షాలు

Last Updated :Aug 26, 2021, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.