ETV Bharat / city

జాతీయ జెండా రూపకర్త తెలుగువారు కావడం గర్వకారణం: చంద్రబాబు

author img

By

Published : Mar 31, 2021, 4:51 PM IST

chandrababu on pingali venkaiah
chandrababu on pingali venkaiah

మువ్వన్నెల జెండా మనదేశ సంస్కృతికి నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. జాతీయ జెండా రూపకర్త తెలుగువారవడం గర్వకారణమని పేర్కొన్నారు.

దేశానికి పింగళి వెంకయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. దేశానికి జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య తెలుగువారు కావడం అందరికీ గర్వకారణం అన్నారు. జాతీయ జెండా రూపొందించి.. నేటితో వందేళ్లు పూర్తయ్యాయని, యావత్ భారతదేశ సంస్కృతికి జెండా నిదర్శనమని అన్నారు.

సమానత్వం, సౌభ్రాతృత్వం, భిన్నత్వంలో ఏకత్వానికి జాతీయ పతాకం.. ప్రతీక అని చెప్పారు. వందేమాతరం, హోం రూల్ ఉద్యమాల్లో పింగళి వెంకయ్య స్ఫూర్తి, చూపిన చొరవ అందరికీ ఆదర్శమని కీర్తించారు. త్యాగం, శాంతి, ప్రగతి అనే మూడు ప్రతీకలను త్రివర్ణం తన సిగలో అలంకరించుకుందని, అశోక చక్రం ధర్మానికి సూచికగా నిలిచిందని వివరించారు.

ఇదీ చదవండి:

విశాఖ కలెక్టరేట్‌ను ముట్టడించిన ఉక్కు నిర్వాసితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.