ETV Bharat / city

'బిల్డ్​ ఏపీ' కోసం రెండు కమిటీలు

author img

By

Published : Feb 26, 2020, 7:03 AM IST

2 committees for build ap mession
బిల్డ్​ ఏపీ కోసం రెండు కమిటీలు

బిల్డ్ ఆంధ్రప్రదేశ్​కు రెండు నూతన కమిటీలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

బిల్డ్​ ఆంధ్రప్రదేశ్​ మిషన్​ అమలులో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో విడివిడిగా కమిటీలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వులిచ్చారు. నవరత్నాలు, నాడు- నేడు కింద సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు,మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం భూములు విక్రయం ద్వారా నిధులు సమీకరణకు నేషనల్ బిల్డింగ్ కన్​స్ట్రక్షన్ కార్పొరేషన్​తో అధికారులు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని ప్రకారం జిల్లాల వారీగా ఎంపిక చేసిన భూములను విక్రయిస్తారు.ఈ క్రమంలో సీఎం ఛైర్మన్​గా రాష్ట్రస్థాయి కమిటీని,కలెక్టర్ ఛైర్మన్​గా జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు ఉత్తర్వుల్లో ఉషారాణి పేర్కొన్నారు.

ఇదీ చూడండి 'ప్రజల భాషలోనే ప్రభుత్వాలు పరిపాలన సాగించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.