ETV Bharat / city

Tirumala: తిరుమల శ్రీవారికి విరాళంగా.. మూడున్నర కిలోల బంగారం

author img

By

Published : Oct 27, 2021, 12:27 PM IST

Updated : Oct 27, 2021, 3:21 PM IST

three and half kgs gold donated to tirumala balaji by a company located in coimbattore
తిరుమల శ్రీవారికి విరాళంగా మూడున్నర కిలోల బంగారం

తిరుమల శ్రీవారికి.. కోయంబత్తూరుకు చెందిన ఓ సంస్థ మూడున్నర కిలోల బంగారం విరాళంగా అందించింది. రూ.1.83 కోట్ల విలువైన బంగారాన్ని.. ఎంఅండ్‌సీ ప్రాపర్టీస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ స్వామివారికి విరాళంగా ఈ కానుక అందజేసింది.

తిరుమల శ్రీవారికి విరాళంగా మూడున్నర కిలోల బంగారం

తిరుమల శ్రీవారి(tirumala balaji)కి మూడున్నర కిలోల బంగారం విరాళంగా అందింది. కోయంబత్తూరుకు చెందిన ఎంఅండ్​సీ ప్రాపర్టీస్ అండ్ డెవలప్​మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1.83 కోట్ల విలువ గల.. 3.604 కేజీల బంగారం బిస్కెట్లు స్వామివారికి కానుకగా అందించింది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో.. అదనపు ఈవో ధర్మారెడ్డికి సంస్థ ప్రతినిధులు ఈ బంగారాన్ని అందజేశారు. అనంతరం ఆలయార్చకులు.. సంస్థ ప్రతినిధులకు ఆశీర్వచనం నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

ఇదీ చదవండి:

TIRUMALA DARSHAN: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

Last Updated :Oct 27, 2021, 3:21 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.