Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్​ దంపతులు

author img

By

Published : Jun 8, 2022, 5:02 PM IST

Updated : Jun 8, 2022, 10:40 PM IST

1

Governor Biswabhusan Visit Tirumala: గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్ దంపతులు.. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వారికి స్వాగతం పలికిన తితిదే ఈవో ధర్మారెడ్డి.. దర్శనానంతరం స్వామివారి లడ్డూ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

Governor Biswabhusan Harichandan News: తిరుమల శ్రీవారిని గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్ దర్శించుకున్నారు. ఈ మధ్యాహ్నం శ్రీ పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్న గవర్నర్​ బిశ్వభూషణ్​ దంపతులకు తితిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి లడ్డూ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని గవర్నర్​కు తితిదే ఈవో అందజేశారు. అనంతరం తిరుపతిలో జరిగిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ బిశ్వభూషణ్‌ హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

Governor Brother Injured at Tirupati: తిరుపతిలో గవర్నర్ బిశ్వభూషణ్ సోదరుడు గాయపడ్డారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన గవర్నర్ కుటుంబ సభ్యులు.. తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో బస చేశారు. ఈ సందర్భంగా బాత్‌రూమ్‌లో గవర్నర్​ సోదరుడు కిందపడిపోయారు. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

Last Updated :Jun 8, 2022, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.