ETV Bharat / city

నేడు కర్నూలుకు లోకేశ్.. యువతి హత్య బాధిత కుటుంబానికి పరామర్శ

author img

By

Published : Aug 17, 2021, 6:40 AM IST

నేడు కర్నూలులో పర్యటించనున్న లోకేశ్
నేడు కర్నూలులో పర్యటించనున్న లోకేశ్

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు కర్నూలులో పర్యటించనున్నారు. ఏడాది క్రితం హత్యకు గురైన హజీర కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అఖిలపక్ష నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కర్నూలులో పర్యటించనున్నారు. గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి వెళ్లనున్నారు. ఏడాది క్రితం హత్యకు గురైన హాజీర కుటుంబాన్ని అఖిలపక్ష నాయకులతో కలిసి పరామర్శించనున్నారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్‌, కాంగ్రెస్‌ నేత తులసీరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం నేత గఫూర్‌ సైతం.. పరామర్శ చేయనున్నారు.

ఇదీ చదవండి:

Ramya Murder: అట్టుడుకిన గుంటూరు.. రమ్య మృతదేహం తరలింపులో తీవ్ర ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.